ఈ
శనివారం వరద చతుర్థి.
ప్రదోష కాలంలో
చవితి ఉంటే వరద చతుర్థి
ఆచరించాలని స్కాంద పురాణం
చెప్తోంది. ఉండాలనుకున్నవాళ్లు
పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం
గణపతిని పూజిస్తారు.
లేదా నువ్వుల
నూనె దీపంతో ఆ విఘ్ననాథుడిని
సాయంత్రం పూజించినా మంచిదే.
ఢూంఢీ గణపతి
పూజలు ఈ వరద చతుర్ధి నాడు బాగా
జరుగుతాయి. ఈ
రోజుని కుంద చతుర్థి అని కూడా
అంటారు. శివుని
మల్లెపూలతో పూజిస్తే సౌభాగ్యాలు
కలుగుతాయని పెద్దలు చెప్తుంటారు.
అందుకే మహా
గణపతిని మనసా స్మరించే ఈ
కీర్తనను మీరూ వినండి.
No comments:
Post a Comment