ఈ
సోమవారం అద్భుతమైన పర్వదినం.
పరాశక్తి సరస్వతిగా
ఆవిర్భవించిన "వసంత
పంచమి". ఈ
రోజున సరస్వతి దేవిని విధిగా
ఆరాధించాలని దేవీ భాగవతం,
బ్రహ్మ వైవర్త
పురాణాలు చెప్తున్నాయి.
వసంత పంచమి నాడు
సరస్వతిని సువాసనలు వెదజల్లే
ఏవైనా తెల్లని పూలు,
అక్షతలతో
పూజించాలి. పాయసాన్ని
ప్రత్యేక ప్రసాదంగా నివేదిస్తారు.
పిల్లలకు అత్యంత
ముఖ్యమైన రోజు. అందుకే
ఈ శ్లోకాన్ని పిల్లలతో
తప్పనిసరిగా పఠింపచేయండి.
విద్యాబుద్ధులు,
తెలివితేటలు
సమృద్ధిగా లభిస్తాయి.
No comments:
Post a Comment